వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో A2 గా విజయసాయిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బెయిల్ పై విజయసాయిరెడ్డి బయట ఉంటూ వస్తున్నారు.
ఈ కేసులో ముందుగా అప్పట్లో విజయసాయి రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది.ఆ తర్వాత విజయసాయిరెడ్డి సీబీఐ న్యాయస్థానంలో బెయిల్ అప్లై చేసుకోగా షరతులతో కూడిన బెయిల్ సిబిఐ ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లకూడదని కూడా తెలపడం జరిగింది.
ఇదిలా ఉంటే ఒక నెల రోజుల క్రితం సీబీఐ న్యాయస్థానంలో దుబాయ్, ఇండోనేషియా దేశాలకు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు.
దాదాపు రెండు వారాలు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరారు.ఇటువంటి క్రమంలో తాజాగా సీబీఐ కోర్టు విజయసాయి రెడ్డి కి విదేశాలు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది.
అక్టోబర్ మాసం కంటే ముందుగానే మళ్లీ వచ్చేయాలని షరతు విధిస్తూ సీబీఐ న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.