వైసిపి పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుఅక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్, విజయసాయిరెడ్డి ల బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని.సీబీఐ న్యాయస్థానంలో గతంలో పిటిషన్ వేయడం తెలిసిందే.
ఈ పిటిషన్ పై అనేక వాదోపవాదాలు విన్న న్యాయస్థానం కొద్ది గంటల క్రితం రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.ఇదే క్రమంలో నిన్న బెయిల్ పిటిషన్ రద్దు మరో న్యాయస్థానానికి మార్చాలంటూ రఘురామకృష్ణంరాజు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ నీ కూడా ఈరోజు ఉదయం తెలంగాణ హై కోర్టు తోసిపుచ్చింది తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో వరుసగా రెండు షాక్ లు రఘురామకృష్ణంరాజు కి ఎదురయ్యాయి.
సిబిఐ న్యాయస్థానం జగన్ విజయసాయి రెడ్డి ఇలా బెయిల్ కు సంబంధించి పిటిషన్ తిరస్కరించడంతో వైసీపీ పార్టీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ రెండు పరిణామాలతో ఈరోజు రఘురామ కృష్ణంరాజు ఇటూ సిబిఐ కోర్టులో అటు తెలంగాణ హైకోర్టు లోనూ చుక్కెదురయింది. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రఘురామకృష్ణంరాజు.
ఈ పిటిషన్ వేసినట్లు జగన్ తరపు న్యాయవాదులు.సీబీఐ న్యాయస్థానంలో బలంగా వాదనలు వినిపించడం జరిగింది.
ఇదే సమయంలో జగన్, విజయసాయి రెడ్డి ఇద్దరు.కూడా ఎక్కడ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించలేదని.స్పష్టం చేశారు.దీంతో ఎప్పటి నుండో జగన్ బెయిల్ రద్దు… సీఎం స్థానంలో వేరొకలు వస్తున్నారని ప్రతిపక్షాల మీడియా చేస్తున్న వార్తలకు తాజా తీర్పుతో చెక్ పెట్టినట్లు అయిందని.
ఈ వార్తపై వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.