నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు.ఏపీ సీఎం వైఎస్ జగన్ కి పారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వటం జరిగింది.
ఈనెల 28 నుండి దాదాపు పది రోజులపాటు పారిస్ వెళ్ళటానికి జగన్ కి న్యాయస్థానం నుండి అనుమతి లభించింది.జగన్ విదేశీ పర్యటనల వాళ్ళ కేసు విచారణ ఆలస్యమవుతుందని సిబిఐ మొదటిలో వాదించగా.
సీబీఐ వాదనను తోసిపుచ్చి.నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాలలో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే.పెద్ద కుమార్తె పారిస్ లో చదువుతున్న క్రమంలో కళాశాల స్నాతకోత్సవానికి రావాలంటూ జగన్ నీ కుమార్తె ఆహ్వానించడం జరిగింది.
అయితే మరోపక్క ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై నమోదైన కేసు కారణంగా విదేశాలకు వెళ్లడానికి.కోర్ట్ పరిమిషన్ అవసరం.
దీంతో పారిస్ పర్యటన నిమిత్తం.నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడంతో తాజాగా కోర్టు పది రోజుల పాటు…పారిస్ పర్యటనకి జగన్ కి అనుమతి ఇవ్వటం జరిగింది.