ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రస్తుతం ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కరోనా వైరస్ ను అదుపు చేసే నేపథ్యంలో అనేక దేశాలు లాక్ డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.
ఇందులో భాగంగానే పిల్లల చదువు కోసం పాఠశాలలను పూర్తిగా రద్దు చేశారు.దీంతో పాఠశాలలకు వెళ్లాల్సిన పిల్లలు, కళాశాలలకు వెళ్లాల్సిన కాలేజీ విద్యార్థులు అందరూ ఇంటికే పూర్తిగా పరిమితమయ్యారు.
గత ఆరు నెలల నుండి పిల్లలు ఇంటికే పరిమితం కావడంతో పూర్తిగా బోర్ ఫీల్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో కొంతమంది వారి క్రియేటివ్ ని ఉపయోగించి ముందుకు సాగుతున్నారు.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి.తాజాగా ఈ కేటగిరీలో కి చేరే మరో వీడియో వచ్చింది.మరి ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దామా…! ఈ మధ్యకాలంలో పిల్లి తనకు ఆకలేస్తే, పియానో వాయించి మరి తన యజమానికి తెలిపే వీడియోను చూశాం.అయితే తాజాగా వచ్చిన ఈ వీడియోలో ఆ పిల్లిని మించి ఈ పిల్లులు తెగ నటించేస్తున్నాయి.
అచ్చం మనుషులలా… ఆ పిల్లలు కుర్చీలలో కూర్చొని తమ బుల్లి యజమాని చెప్పే పాటలను వింటున్నట్లు తెగ నటించేస్తున్నాయి.అంతే కాదు అది ఏదో అర్ధమయినట్లు తలా ఆడిస్తున్నాయి కాబోలు.
అయితే ఓ చిన్న అమ్మాయి టీచర్ ఆట ఆడింది.మామూలుగా ఎవరైనా ఈ ఆటలో వారి స్నేహితులను లేకపోతే ఎవరైనా సరే ఎదురుగా కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తారు.
అయితే ఇక్కడ మాత్రం కాస్త వెరైటీ.ఆ చిన్నారి పాటలు చెప్పే సమయంలో రెండు పిల్లలను రెండు కుర్చీలు వేసి కూర్చోబెట్టి పాఠాలు చెప్పింది.ఆ చిన్నారి తన పెంపుడు పిల్లలను విద్యార్థుల లాగ మార్చేసి తాను పాఠాలు చెబితే అవి వినేలా మార్చేసింది.ఎంతైనా పిల్లులు కదా… ఒకే చోట ఉండవు, అటు ఇటు తిరుగుతాయి.
కానీ, ఈ పిల్లలు మాత్రం తన బుల్లి యజమానురాలు చెప్పే పాఠాలు మాత్రం శ్రద్ధగా వింటున్నాయి.అంతేకాదు వాటి ముందర పుస్తకాలు స్టేషనరీ నేను కూడా ఉంచింది ఆ బుల్లి యజమానురాలు.
ఈ సన్నివేశాన్ని మొత్తం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వీడియోను ట్విట్టర్ లో ‘క్యాట్ క్లాస్’ అనే శీర్షిక ను జతచేసి పోస్ట్ చేశారు.
అతి తక్కువ సమయంలో ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.ఏదేమైనా ఈ వీడియోలో పిల్లలు మాత్రం అచ్చం విద్యార్థులులా టీచర్ చెప్పే పాఠాలు వింటున్నాయి.