రచ్చ సినిమాతో సంపత్ నంది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.బాక్స్ ఆఫీస్ దగ్గర హీరో రామ్ చరణ్ ని సూపర్ మాస్ హీరోగా ఎలివేట్ చేసిన డైరెక్టర్ సంపత్ నంది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి పని చెయ్యాల్సి ఉంది.
ఆ తరవాత అతన్ని తొలగించి బాబీ తో సినిమా తీసిన సంగతి తెలిసిందే.
ఆ తరవాత సంపత్ తన దగ్గర ఉన్న కథ తో బెంగాల్ టైగర్ సినిమా తీసి హిట్టు కూడా కొట్టేసాడు.
మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సంపత్ నంది ఇప్పుడు గోపీ చంద్ తో ఒక సినిమాకి ఫిక్స్ అయ్యాడు.ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న గోపిచంద్ జ్యోతికృష్ణ డైరక్షన్లో ఆక్సీజన్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఆ సినిమా తర్వాత సంపత్ నందితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపిచంద్.కమర్షియల్ సినిమాలను హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా తీయగలనని రచ్చ, బెంగాల్ టైగర్ లతో నిరూపించుకున్న సంపత్ నంది ఇప్పుడు గోపిచంద్ ను కూడా మిసైల్ గా చూపించేందుకు సిద్ధమయ్యాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ త్రెసా ను తీసుకుంటున్నట్టు టాక్.కేవలం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలనే చేస్తూ క్రేజ్ సంపాదించిన కేథరిన్ తెలుగులో గోపిచంద్ తో ఛాన్స్ కొట్టేసింది.
మరి ఈ లక్కీ ఆఫర్ ను కేథరిన్ ఏవిధంగా తన కెరియర్ కు హెల్ప్ అయ్యేలా చేసుకుంటుందో చూడాలి.