నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబోలో రాబోతున్న చిత్రం షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే.వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను బోయపాటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా కేథరిన్ తెర్సా ఎంపిక అయ్యిందని తెల్సిందే.కోటి రూపాయలు ఇచ్చి మరీ బాలయ్యకు జోడీగా కేథరిన్ను నటింపజేస్తున్నారు.భారీ ఎత్తున హీరోయిన్ కేథరిన్తో సీన్స్ ఉంటాయట.సినిమాలో కేథరిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.ఇక సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రచారం సమాజంలో ఉన్న చెడును తుడిమేసేందుకు నడుం భిగించిన ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కేథరిన్ కనిపించబోతుందట.
బోయపాటి గత చిత్రం సరైనోడులో కేథరిన్ తెర్సా ఎమ్మెల్యేగా కనిపించింది.ఆ పాత్ర కేథరిన్కు మంచి పేరును తెచ్చి పెట్టింది.ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఉన్నా ఎమ్మెల్యే పాత్ర పోషించిన ఈ అమ్మడికే మంచి పేరు వచ్చింది.
అందుకే ఇప్పుడు ఐఏఎస్ పాత్ర చేయబోతుంది కనుక మళ్లీ కేథరిన్ కుమ్మేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్కు ఎమ్మెల్యే అయిన ఈ అమ్మడు బాలయ్యకు ఐఏఎస్ కాబోతుంది.
మరి ఏ స్థాయిలో బాలయ్య సినిమాకు ఈ అమ్మడు ఊపు తెస్తుందో చూడాలి.