కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది.సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది.
ఇప్పటికే కోటి మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు.ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.
ఇది మనుషుల నుంచి మనుషులకే కాదు.పెంపుడు జంతువులకు కూడా సోకుతుంది.
ఇది వరకు ఓ కుక్కకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా లండన్ లో ఓ పిల్లికి కరోనా వైరస్ సోకింది.పిల్లి శ్వాస తీసుకోవడంలో పిల్లి ఇబ్బంది పడటంతో యజమాని దానికి పరీక్షలు చేయించాడు.ఈ పరీక్షల్లో పిల్లికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
అయితే పిల్లి యజమానులు కరోనా భారిన పడి ఇటీవల కోలుకున్నారు.యజమాని కుటుంబ సభ్యుల నుండే కరోనా వైరస్ వచ్చిందని వైద్యులు అనుమానిస్తున్నారు.
అయితే జంతువులకు కరోనా వచ్చిన కేసులు తక్కువగా నమోదైయ్యాయి.అయితే శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కరోనా వైరస్ సోకినా జంతువులపై ఇప్పటివరకు ఎలాంటి ప్రయోగాలు నిర్వహించలేదు.అయితే ఈ వైరస్ దూకుడు చుస్తే జంతువుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా అనే కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.అయితే మరోవైపు గబ్బిలాల నుంచి కరోనా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందని మొదట్లో అనుమానాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి రుజువు కాలేదని తెలిపారు.ఇప్పుడు జంతువులకు సైతం కరోనా సోకటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.