ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని త్వరగానే తెలుసుకుంటున్నారు.దీనికితోడు చిత్ర యూనిట్ సభ్యులు కూడా తమ చిత్రాలలో నటించడానికి కావలసినటువంటి నటీనటుల మరియు ఇతర టెక్నీషియన్స్ కోసం ఏకంగా “క్యాస్టింగ్ కాల్” వివరాలను కూడా సోషల్ మీడియాల ద్వారా షేర్ చేస్తూ ప్రకటిస్తున్నారు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్-కే అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అయితే ఈ చిత్రానికి మహానటి మూవీ ఫెమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ బ్యానర్ అయిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.కాగా ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “దీపికా పదుకొనే” నటిస్తుండగా మెగాస్టార్ “అమితాబ్ బచ్చన్” ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని దాదాపుగా 5 భాషలలో దేశ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో ఈ చిత్రంలో నటించేందుకు నటీనటులు మరియు ఇతర టెక్నీషియన్ల కోసం క్యాస్టింగ్ కాల్ ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.ఇందులో భాగంగా ఈ నెల 3వ తారీకున పూణే మరియు ముంబై ప్రాంతాలలో ఆడిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అలాగే 5వ తారీఖున గోవాలో కూడా ఈ క్యాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ విషయానికి సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో ఉన్నటువంటి మెయిల్ ఐడి తమ పూర్తి వివరాలను పంపించాలని కోరారు.మరి లేట్ ఎందుకు మీకు సినిమాలలో నటించడానికి ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
ఆల్ ది బెస్ట్.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రాజెక్టు చిత్రం కోసం దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో హీరోగా మొదటగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ని నటించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ సంపాదించినప్పటికీ చిరంజీవి ప్రభాస్ ని సూచించాడట.ఆ విదంగా ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ చాన్స్ కొట్టేశాడు.
కాగా ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.