బంగారుపాళ్యం ఘటనలో టీడీపీ నేతలపై కేసులు నమోదు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనలో పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.టీడీపీ నేత నారా లోకేశ్ సహా సీనియర్ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

 Cases Registered Against Tdp Leaders In Bangurapalayam Incident-TeluguStop.com

పోలీసులు సిద్ధం చేసిన ఎఫ్ఐఆర్ లో లోకేశ్, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానితో పాటు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.కాగా ఐపీసీ సెక్షన్లు 353, 290, 188, 341 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.

యువగళం పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.అయితే, నిన్న బంగారుపాళ్యంలో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

దాంతో పాటు యువగళం వాహనాలను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, టీడీపీ నేతలను తోపులాట జరిగిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube