బెట్టింగుల్లో నష్టపోయారట... అందుకే కేసు పెట్టారు

బెట్టు కట్టడం అనేది నేరం అలాంటిది బెట్టు కట్టి మేము నష్టపోయాం అంటూ ఒక న్యాయవాది కేసు పెట్టారు.ఇంతకీ ఆ బెట్టింగ్ ఏంటంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా,వైసీపీ గెలుస్తుందా అని తెగ బెట్టింగులు జరిగిన సంగతి తెలిసిందే.

 Case Registered Against Lagadapati-TeluguStop.com

అయితే ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే ను నమ్ముకొని చాలా మంది బెట్టింగులు నిర్వహించారు.ఈ క్రమంలో రాజగోపాల్ సర్వే ప్రకారం చాలా మంది టీడీపీ గెలుస్తుంది అని బెట్టు కట్టరట.

దీనితో ఎన్నికల ఫలితాలు ఏమో తారు మారు కావడం తో ఇప్పుడు కొవ్వూరు కు చెందిన మురళి కృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసారు.

-Telugu Political News

ఎన్నికల ఫలితాలకు ముందు లగడపాటి విడుదల చేసిన సర్వే వల్ల అనేక మంది బెట్టింగ్‌ల్లో నష్టపోయారని పేర్కొంటూ కొవ్వూరు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.లగడపాటి సర్వేల వెనుక అంతర్జాతీయ బెట్టింగ్‌ మాఫియా ఉందని అనుమానం వ్యక్తం చేసిన మురళీకృష్ణ.

నిజానిజాలు తేల్చాలని తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube