మరో టీడీపీ మాజీ మంత్రి పై కేసు నమోదు..!!

ఈరోజు ఉదయమే సంగం డైరీ సంస్థలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ని ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా మరో టీడీపీ మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ పార్టీ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై తాజాగా కేసు నమోదైంది.

 Case Registered Against Another Tdp Ex-minister Alapati Rajendra Prasad ,tdp, Al-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తేఎన్నారై ఆసుపత్రి చైర్మన్ నిమ్మగడ్డ ఉపేంద్ర నాధ్ ను ఆలపాటి రాజేంద్రప్రసాద్ బెదిరించినట్లు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.

మంగళగిరిలో ఉన్న ఎన్నారై మెడికల్ కాలేజ్.

జనరల్ హాస్పిటల్ కి చెందిన వివాదం వల్ల ఈ కేసు నమోదైనట్లు.ఏపీ రాజకీయాల్లో టాక్.

పూర్తి విషయంలోకి వెళితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోదరుడు రవి గతంలో.ఎన్నారై పాలక కమిటీలో మెంబర్ గా ఉన్నారు.

అయితే కమిటీలో ఇటీవల కొన్ని వివాదాలు రావటంతో.ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోదరుడిని కమిటీ నుండి తప్పించారు.

ఈ క్రమంలో మళ్లీ తన సోదరుడిని కమిటీ లోకి తీసుకోవాలి అంటూ లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిమ్మగడ్డ ఉపేంద్ర నాథ్ ని ఆలపాటి రాజేంద్రప్రసాద్ బెదిరించడంతో ఆయనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు అయిందట.ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

ధూళిపాల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి నాయకులు కావటంతో … జిల్లాలో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube