నిర్మాత సి.కళ్యాణ్ పై కేసు నమోదు..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు.

 Case Filed On Tollywood Producer C Kalyan,latest News-TeluguStop.com

ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే కళ్యాణ్ పై లేటెస్ట్ గా ఓ కేసు నమోదైంది. షేక్ పేట భూవివాదం పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో నిర్మాత కళ్యాణ్ పై కేసు ఫైల్ చేశాడు.

అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న స్వరూప్ 1985లో షేక్ పేటలో ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నుండి భూమి కొన్నారు.ఈ స్థలాన్ని 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకి ఇచ్చాడు.

అప్పటి నుండి లీజుకి తీసుకున్న నారాయణ మూర్తి ఆర్గానిక్ స్టోర్ ను నడుపుతున్నారు.అయితే సోమవారం సాయంత్రం కళ్యాణ్ మనుషులు ముగ్గురు వచ్చి స్టోర్ కు తాళం వేశారు.

Telugu Banjarahills, Kalyan, Filed, Shakepet, Tollywood-Movie

ఆర్గానిక్ స్టోర్ యజమాని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలో దిగిన పోలీసులు కళ్యాణ్ తో పాటు షరూఫ్, శ్రీకాంత్, తేజశ్విలపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం పోలీసుల్ ఈ విషయంపై విచారణ నిర్వహిస్తున్నారు.సి.కళ్యాణ్ ఇదివరకు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు.అయితే ఈ కేసు విషయమై నిర్మాత సి.కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube