గురువారం జరిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68 లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఫ్యాన్స్ అంతా గుమిగూడారు.ఆ టైం లో ఫ్యాన్స్ అంతా బాణాసంచాలు కూడా కాల్చారు.
పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో అక్కడ రద్దీగా మారింది.అంతేకాదు ఫ్యాన్స్ ఎవరు కోవిడ్ నిబంధనలు పాటించలేదని తెలుస్తుంది.
రాత్రి టైం లో బాణాసంచా కాల్చి అక్కడ ఉన్న వారికి ఇబ్బంది కలిగేలా చేశారు.అయితే అక్కడ నివాసం ఉంటున్న వారు 100కి డయల్ చేసి కంప్లైంట్ చేశారట.
పర్మిషన్ లేకుండా బాణాసంచా కాల్చడంతో పాటుగా అంతమందిని అక్కడ గుమిగూడేలా చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్, మరో అభిమాని సంతోష్ లపై కేస్ ఫైల్ చేశారు.అల్లు అర్జున్ అభిమానుల మీద ఐపీసీ సెక్షన్ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఎక్కువవుతున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా చూసుకోవాలని స్టార్స్ కూడా వారి అభిమానులకు చెప్పాలని పోలీసులు కోరుతున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సర్ ప్రైజ్ తో తన ఫ్యాన్స్ కేసులో ఇరుక్కోవడంపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.