బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే అలియా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొన్నారు.అయితే తాజాగా అలియా భట్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీపై కేసు నమోదైంది.
సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ వివాదాస్పద అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు.ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయ్ కతియావాడి అనే సినిమా తెరకెక్కుతోంది.మాఫియా క్వీన్ గంగుబాయి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా టైటిల్ రోల్ లో అలియా భట్ నటిస్తున్నారు.
గంగూబాయి కుమారుడు రాజీ షా గంగూబాయ్ కతియావాడి సినిమా షూటింగ్ ఆపాలంటూ కేసు పెట్టారు.
ఈ సినిమా నిర్మాణ సంస్థ, అలియా భట్, సంజయ్ లీలా భన్సాలీపై కూడా రాజీ షా కేసు పెట్టడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది.సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో గంగూబాయిని అసభ్యంగా చూపిస్తున్నారని.అవసరమైతే సినిమాపై పరువు నష్టం దావా వేస్తామని రాజీ షా లాయర్ వెల్లడించారు.
కోర్టు దాఖలైన కేసు గురించి స్పందించాలని కోరుతూ చిత్ర యూనిట్ కు సమన్లు జారీ చేసింది.
జనవరి 7వ తేదీలోగా చిత్ర యూనిట్ స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
వేశ్యాగృహాలకు అధిపతి అయిన గంగూబాయి రియల్ లైఫ్ కథతో తెరకెక్కుతున్న గంగూబాయ్ కతియావాడి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం.బాంబే సివిల్ కోర్టులో కేసు దాఖలు కాగా చిత్రయూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుని విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.