2019 హైదరాబాద్ లో జరిగిన దిశ రేప్ ఏ విధంగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎన్ కౌంటర్ చేసి పోలీసులు దిశకు న్యాయం జరిగేలా చేశారు.
ఈ క్రమంలోనే దిశా రేప్ కేసు విషయంలో పలువురు సినీ సెలబ్రిటీల పై ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు.అసలు దిశ రేప్ కేసుకు సినీ నటులకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, నటి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరో 38 మంది సెలబ్రిటీల పై కేసు నమోదు చేశారు.ఈ సెలబ్రిటీల అందరి పై కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటంటే.
బాధితురాలి పేరును ఈ నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆమె పేరున బహిర్గతం చేస్తూ మాట్లాడటం వల్ల సెలబ్రిటీల పై న్యాయవాది గౌరవ్ గులాటి ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వీరిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా,సబ్జీ మండీ పోలీసు స్టేషన్లో సెక్షన్ 228 ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయబడినది.ఈ క్రమంలోనే లాయర్ గౌరవ్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు పలువురు సెలబ్రిటీల పై కేసు నమోదు చేశారు.ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఫిర్యాదులో భాగంగా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, ఛార్మి, అమితాబచ్చన్, అల్లు శిరీష్ ,హర్భజన్ సింగ్ వంటి తదితర పేర్లను కూడా నమోదు చేయడం గమనార్హం.