తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రోజు ప్రతి గంటల లక్షలాది మంది భక్తులతో కిఠకిఠలాడిపోతూనే ఉంటుంది.కాని గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి కొండలు బోసి పోతునానయి.
ముఖ్యంగా నేడు రధ సప్తమి సందర్బంగా కూడా తిరుమలలో జనాలు కనిపించలేదు.దీనికి కారణం కరోనా వైరస్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విమానాశ్రాయాల్లో మరియు రైల్వే స్టేషన్స్లో పెద్ద ఎత్తున జనాలు ఉండటం మంచిది కాదంటూ మొదటి నుండి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది.ఆ కారణంగా భక్తులు తిరుమలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
సాదారణంగా అయితే లక్షల మంది రథ సప్తమికి హాజరు అవుతారు.కాని ఈసారి మాత్రం దారుణమైన సంఖ్య నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
కరోనా భయంతో జనాల్లోకి వెళ్లేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.ఆ కారణంగానే రథ సప్తమికి జనాలు తక్కువ అయ్యారు అంటూ తిరుమల స్థానికులు అంటున్నారు.
ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఇలా కొనసాగేనో అంటూ స్థానిక వ్యాపారలు వాపోతున్నారు.గతంలో ఎప్పుడు లేని పరిస్థితి కరోనా వల్ల ఏర్పడింది.
చైనా మాత్రమే కాకుండా ప్రపంచంలో పలు దేశాలు కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శణం.