ప్రస్తుతం ప్రజలను ఏదైనా గజగజ వణికిస్తోంది అంటే అది ఖచ్చితంగా కరోనా వైరస్ అనే చెప్పచు.చైనాలో పుట్టిన ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది.
దీంతో ప్రపంచంలో దేశాలు అన్నింటిని ఇప్పటికే కరోనా వైరస్ పలకరించింది.ఈ వైరస్ ని అంతం చెయ్యడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి విదితమే.అయితే ఈ వైరస్ భారిన ఇప్పటికే 10వేల మందికిపైగా పడ్డారు.
దాదాపు 300 మంది కరోనా కారణంగా మృతి చెందారు.ఇలాంటి సమయంలో కరోనా వైరస్ పై ఆస్ట్రేలియన్ సైంటిస్టులు తొలి విజయం సాధించారు.
అది ఏంటి అంటే ? మొట్టమొదటిసారి వారు కరోనా వైరస్ను రీ-క్రియేట్ చేశారు.ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ మైక్ కాటన్ అనే శాస్త్రవేత్త ఈ కారొన వైరస్ ను కనుగొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న ఈ వైరస్ ఎలా పుడుతుందో కనుకున్నాం కాబట్టి త్వరలోనే దీనికి వీరుడు కానీ పెడుతాం అని ఆ డాక్టర్ చెప్పాడు.అంటే త్వరలోనే ఈ వైరస్ కు మందు వచ్చేస్తుంది.