నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, నదుల్లో వరద నీరు భారీగా చేరాయి.దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాలు.
వాగులు దాటుతుండగా టీఆర్ఎస్ పార్టీ నేత కారుతో సహా వాగులో పడి గల్లంతయ్యాడు.స్థానికులు గమనించి కారులో ఉన్న ముగ్గరుని బయటకు తీసినా నాలుగో వ్యక్తి అయిన టీఆర్ఎస్ నేత కారుతో సహా కొట్టుకుపోయాడు.
ఈ విషయం అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
టీఆర్ఎస్ నేత కారుతో సహా వాగులో పడి గల్లంతైన ఘటన సిద్ధిపేట జిల్లా దర్గాపల్లిలో చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్ నిన్న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు.కారులో వెళ్తుండగా సిద్ధిపేట జిల్లా దర్గాపల్లి వాగులో కారు అదుపు తప్పి పడిపోయింది.
అది గమనించిన స్థానికులు కారులో ఉన్న ముగ్గురి బయటకు తీయగా వరద ఉధృతి పెరగడంతో కారుతో సహా శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు.
వెంటనే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కాల్ చేసి సహాయక చర్యలు చేపట్టమని ఆదేశించారు.ఈ మేరకు సిద్ధిపేట ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.