హుజురాబాద్ లో రంగంలోకి దిగిన కెప్టెన్... ఈటెల చాప్టర్ క్లోజేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ – కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.మంత్రి కేటీఆర్ ను సీఎం చేయడానికి ఈటెల అంగీకరించక పోవడంతోనే ఈటెలకు కేసీఆర్ కు మధ్య రాజకీయంగా చెడిందని ప్రచారంలో ఉంది.

 Captain Who Entered The Field In Huzurabad Spear Chapter Closena Etela Rajender,-TeluguStop.com

అయితే మెదక్ జిల్లా మూసాయిపేటకు చెందిన రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ తక్షణమే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.ఇక వెంటనే విచారణ ప్రారంభించిన రెండు రోజులకే ఈటెలను మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేయడంతో ఇక కేసీఆర్ పై విమర్శల దాడి పెంచారు ఈటెల.

అయితే ఇక హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ అక్కడ ఈటెల గత 20 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఈటెల కంటూ అక్కడ ప్రత్యేక వర్గం ఏర్పడింది.అయితే ఇప్పుడు ఈటెల టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారడంతో అక్కడ టీఆర్ఎస్ పట్టు కోల్పోకుండా కేసీఆర్ ప్రత్యేక వ్యూహ రచన ప్రారంభించారు.

ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావుకు హుజురాబాద్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.అయితే ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంపై కెప్టెన్ లక్ష్మి కాంతారావు దృష్టి సారించారు.

ఇక రానున్న కాలంలో కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తే ఈటెల చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube