హుజురాబాద్ లో సైలెంట్ గా పావులు కదుపుతున్న కెప్టెన్ లక్ష్మీ కాంతారావు.. అసలు వ్యూహం ఇదే?

కెసీఆర్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తులలో మొదటి వరుసలో ఉంటారు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు.కెసీఆర్ కు మొదటి నుండి అత్యంత సన్నిహితంగా  మెలుగుతూ కెసీఆర్ కు నమ్మిన బంటులా మారారు.

 Captain Lakshmi Kantaravu Moving Pieces Silently In Huzurabad .. Is This The Rea-TeluguStop.com

రాజ్యసభ పదవి ఇస్తూ తన కుమారుడు వొడితల సతీష్ కుమార్ కు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ వారితో మంచి సన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న ఛాలెంజ్ హుజూరాబాద్ ఉప ఎన్నిక.

దుబ్బాక తరహాలోనే ఈ ఉప ఎన్నిక సైతం రసవత్తరంగా మారే అవకాశం ఉన్న పరిస్థితులలో కెసీఆర్ ఒక్క వ్యూహం కాకుండా పలు రకాల వ్యూహాలను పన్నుతున్నాడు.

హుజూరాబాద్ లో మంచి పట్టున్న కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ఇప్పటికే అక్కడ మకాం కేసిన విషయం తెలిసిందే.

అయితే అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని మొత్తం తానై నదిశపిస్తున్నాడు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు.అక్కడ బీజేపీకి సొంతంగా బలం లేకపోవడంతో టీఆర్ఎస్ కు 20 సంవత్సరాలుగా అక్కడ ఏక ఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న పరిస్థితులలో ఏ వొక్క ఛాన్స్ కూడా బీజేపీకి ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్న పరిస్థితి ఉంది.

  అయితే ఉప ఏఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాగానే అక్కడ టీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube