విశాఖ రాజధాని ప్రకటనపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును డైవర్ట్ చేయడానికే రాజధాని డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు.భూ దోపిడీ కోసమే విశాఖ రాజధాని అంటున్నారని విమర్శించారు.
మూడు రాజధానుల అంశం కోర్టులో ఉండగా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.విశాఖే ఏపీ ఏకైక రాజధానని జగన్ చెప్పడం సరికాదని పేర్కొన్నారు.
కడప ఎంపీకి సీబీఐ పిలుపు వచ్చినప్పటి నుంచి జగన్ కు నిద్ర లేదన్నారు.నిజమైన ముద్దాయిలు జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని వెల్లడించారు.