ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసం చాలా కలలు కన్నాడని, ఆయన కలలు సాకారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని ఏర్పాటు చేయాలని సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో చాలా కలలు కన్నాడని, ఆయన కలలను వైకాపా ప్రభుత్వం కళ్లలు చేసేలా ఉన్నాయంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ నేడు జగన్ చేసిన ప్రకటనతో ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారు మరియు అక్కడ భూములు ఉన్న వారు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారంటూ ఈ సందర్బంగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రం అభివృద్ది ముందుకు కాకుండా వెనక్కు వెళ్తుంది అంటూ ఈ సందర్బంగా టీడీపీ నాయకులు అంటున్నారు.