ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పైగా రోజు రోజుకూ పార్టీ ప్రతిష్ట కిందకు పడిపోతూనే ఉంది.
ఇలాంటి సమయంలో పార్టీలో లోకేష్ రంగంలోకి దిగాల్సిన సమయం మళ్లీ వచ్చేసిందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది.ఇప్పటి వరకు లోకేష్ ఏమైనా పోరాటాలు చేశారా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది.
కానీ కరోనా సమయంలో స్కూళ్ల విషయంలో మాత్రం లోకేష్ చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది.అప్పుడు ఆయన చేసిన పోరాటం సక్సెస్ కూడా అయింది.
కాగా ఇప్పుడు మరోసారి ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది.ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల్లో స్కూళ్లను మూసేస్తున్న విషయం తెలిసిందే.తెలంగాణలో కూడా స్కూళ్లకు సెలవులు పెంచేశారు.అయితే ఏపీలో స్కూళ్ల విషయంలో మాత్రం ఏపీ సర్కారు గతంలో లాగే చేస్తోంది.
స్కూళ్లకు సెలవులు ఇచ్చేది లేదని తేల్చేసింది.దీంతో ఇప్పుడు మరోసారి లోకేష్ రంగంలోకి దిగాలని టీడీపీ తమ్ముళ్లు భావిస్తున్నారంట.
ఇప్పటికే స్టూడెంట్ల తల్లిదండ్రుల్లో ఎక్కడ లేని ఆందోళన పెరిగిపోతోంది.కాబట్టి మరోసారి టీడీపీ తన పనితనం చూపించాల్సిన సమయం వచ్చేసింది.
దీంతో ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఈ తరహా డిమాండ్లు బాగా పెరిగిపోతున్నాయి.చంద్రబాబు వారసుడిగా లోకేష్ తన సత్తాను చూపించుకునేందుకు ఇది మంచి అవకాశం అని కూడా భావిస్తున్నారంట తమ్ముళ్లు.మరి ఈ విషయంలో మరోసారి ప్రభుత్వం లోకేష్ కు అవకాశం ఇస్తుందా లేకపోతే పునరాలోచించి నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.కానీ స్కూళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో టీడీపీకి మాత్రం పోరాడే ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారంట చాలామంది వైసీపీ నేతలు.
చూడాలి మరి జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో.