యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు అడివి శేష్ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమా ఉందనే విషయం కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.
ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న మహేష్ బాబు సినిమాను ప్రమోట్ చేయడంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తు్న్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.ఈ సినిమాపై ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక ట్వీట్ చేసిన మహేష్, మరే ఇతర విషయాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకోలేదు.
దీంతో ఈ సినిమా రిలీజ్ నాటికైనా ప్రమోషన్స్ చేయకపోతే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు రాకపోవచ్చని సినీ విమర్శకులు అంటున్నారు.మహేష్ ఒక్క ట్వీట్తో ఆడియెన్స్ థియేటర్లకు రావడం కష్టమని వారు అంటున్నారు.