ఏపీలో సంచలనం సృష్టించిన హత్యకేసు మాజీ మంత్రి వివేకానందరెడ్డిదే అని చెప్పవచ్చూ.ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ బాబాయి మరణిస్తే ఆ కేసు ఇప్పటి వరకు తెగకపోవడం కొందరిని దిగ్బ్రాంతికి గురిచేస్తుందట.
ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరిద్దరు మరణించగా, మిగతా వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే.కాగా ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ, జగన్ కుటుంబ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఈ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ ఉందని రుజువు గనుక అయితే తనను ఎక్కడైనా సరే బహిరంగంగా ఉరితీయొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా ఈ కేసులో నిజాలను తేల్చకుండా అనవసరంగా నిర్దోషిని అయిన తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలపై ఆదినారాయ పై విధంగా స్పందించారు.