ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తుంటే మనుషుల కంటే జంతువులే చాలా నయం అనిపిస్తోంది.ఎందుకుంటే కొన్ని విషయాల్లో మనుషులకంటే కూడా అవే చాలాబాగా నియమాలు పాటిస్తుంటాయి.
కాగా ఇప్ఉపడు కొన్ని ఆవులు అయితే మనుషుల లాలా కాకుండా మూత్రం పోసేందుకు ఏకంగా బాతౄంకు వెళ్తున్నాయి.అదేంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే.
ఆ ఆవులు మూత్రం పోసేందుకు ఎంతో శ్రద్ధగా టాయిలెట్ కు వెళ్లడం ఇప్పుఉ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇదే నిజం.
జర్మనీ సైంటిస్టులు చేసి చూపించిన అద్భుతం ఇది అని చెప్పాలి.వారు ఎంతో ఓపికగా ఆవులను మరుగుదొడ్డికి మూత్రం వస్తే వెళ్లే విధంగా ట్రైనింగ్ ఇచ్చి అచ్చం మనుషుల్లాగే అవి కూడా సమయానికి బాతౄంకు వాటంతట అవే వెళ్తున్నాయి.
ఇలా చేయడం ద్వారా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను చాలా వరకు నిరోధించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.ఎందుకుంటే ఆవులు ఆరుబయట మూత్రం పోయడం వల్ల వాటి యూరిన్ నుంచి వెలువడేటటువంటి అమ్మోనియా అనే ద్రావణం గనక మట్టితో కలిస్తే అది గ్రీన్హౌస్ వాయువు నైట్రస్ ఆక్సైడ్గా తయారవుతుందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.
కాబట్టి జర్మనీ లోని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫార్మ్ యానిమల్ బయాలజీ ఇన్ స్టిట్యూట్ లో పనిచేస్తున్న కొందరు సైంటిస్టులు తమ ప్రయోగాల్లో భాగంగా 16 ఆవులకు ఇలా వాటంతట అవే టాయ్లెట్ వస్తే బాతౄంకు వెళ్లే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు.ఇక ఈ పద్ధతికి మూలూ అని పేరు కూడా పెట్టారు.ఇందులో భాగంగా ఆ ఆవులను మూలూ దొడ్డిలో ఉంచి అవి ఆరుబయట మూత్ర విసర్జన చేసినప్పుడల్లా ఆహారం ఇవ్వకపోవడం, ఇక మరుగుదొడ్డికి వెళ్లిన వాటికి మాత్రమే ఆహారాన్ని ఇవ్వడంతో మిగతా ఆవులు కూడా అలాగే చేయడం స్టార్ట్ చేశాయి.
.