తిరుమల శ్రీవారి ఆలయంలో దీపం కొండెక్కిందా?

కరోనా వైరస్‌ విపరీతంగా విజృంభిస్తున్న ఈ సమయంలో దేవాలయాలు అన్ని కూడా మూత పడ్డ విషయం తెల్సిందే.భక్తుల దర్శణంకు అనుమతించని అధికారులు నిత్యం మాత్రం పూజలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.

 Can A Lamp Be Lit In The Thirumala Srivari Temple, Ttd, Corona Virus, Tirumala-TeluguStop.com

అయితే గత రెండు మూడు రోజులుగా తిరుపతి శ్రీవారి ప్రధాన ఆలయంలో అఖండ జ్యోతి ఆరిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు.పూజారులు పట్టించుకోక పోవడంతో అఖండ జ్యోతి ఆరిపోయిందని కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఆ విషయమై ఆలయ ప్రధాన పండితులు ఇంకా అధికారులు స్పందించారు.సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు అస్సలు నమ్మవద్దని, ప్రతి నిత్యం శ్రీవారికి జరగాల్సిన సేవలు అన్ని జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

కరోనా ప్రభావం నుండి తెలుగు రాష్ట్రాలను దేశాన్ని కాపాలంటూ శ్రీవారికి ప్రత్యేక యాగం కూడా చేయబోతున్నట్లుగా టీటీడీ అధికారులు వెళ్లడి చేశారు.ప్రతి రోజు స్వామివారికి శాస్త్రోక్తంగానే పూజలు జరుగుతున్నాయని అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube