కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరియర్ లో ఫస్ట్ టైం ఓ స్ట్రైట్ తెలుగు సినిమాకు సైన్ చేశారు.వెంకీ అట్లూరి డైరక్షన్ లో సార్ అంటూ ఓ సినిమాను ఈ మధ్యనే మొదలు పెట్టారు.
సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మళయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.హీరో ధనుష్ కి కరోనా పాజిటివ్ రావడం వల్ల సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందట.
అంతేకాదు సినిమా నుండి కెమెరా మెన్ దినేష్ కృష్ణన్ బయటకు వచ్చేశారని తెలుస్తుంది.ఈ విషయాన్ని స్వయానా సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ తన ట్విట్టర్ లో వెల్లడించారు.
దుర దృష్టావశాత్తు ఈ సినిమాలో నేను భాగం కాలేకపోతున్నాను.తర్వాత త్వరలో కలిసి పనిచేస్తానని అంటూ ట్వీట్ చేశారు దినేష్ కృష్ణన్.
ఆయన చేసిన ట్వీట్ చూస్తే ధనుష్ సార్ నుండి ఆయన ఎగ్జిట్ అయినట్టు అర్ధమవుతుంది.మరి సార్ కి కొత్త సినిమాటోగ్రాఫర్ ఎవరు.
అసలు ఇంతకీ దినేష్ కృష్ణన్ ఎందుకు ఈ సినిమాని వదిలి వెళ్లారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాకు పనిచేస్తున్న దినేష్ కృష్ణన్ శివ కార్తికేయన్ సినిమాకు కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది.