అమెరికాలో ఓ జంటకి అక్కడి న్యాయస్థానం విధించిన జరిమానా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.మేము చేసిన ఈ పనికి భారీ మొత్తంలో జరిమానానా అంటూ నోళ్ళు వెళ్ళబెట్టుకుని లబోదిబో అంటున్నారు ఆ జంట.
ఇంతకీ 42 కోట్ల జరిమానా కోర్టు విధించింది అంటే ఆ జంట చేసిన తప్పు ఏమయ్యిఉంటుంది అనే ఆలోచన అందరిలో కలిగి ఆ విషయం తెలుసుకుని ఒక్క సారిగా షాక్ అయ్యారట.ఇంతకీ ఆ జంట చేసిన తప్పు ఏమిటి అంటే.
అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉండే ఓ జంట ఇల్లు కట్టుకుందామని ఫిక్స్ అయ్యింది.అందుకు తమ స్థలంలో ఉన్న ఓ చెట్టుని త్రవ్వి తీసేశారు .దాంతో ఆ జంటపై కాలిఫోర్నియా న్యాయస్థానంలో కేసు నమోదు అయ్యింది.కోర్టు ముందు ఆ జంటని హాజరు పరుచాగా న్యాయమూర్తి ఆ జంటకి 42 కోట్లు జరిమానా విధించడంతో షాక్ అయ్యారు.
ఎందుకు మాకు అంతటి భారీ జరిమానా అని ప్రశ్నించగా ఆ చెట్టు కొన్ని ఏళ్ల నాటిది., సుమారు 180 ఏళ్ల చరిత్ర ఉంది పైగా
మీరు ఆ చెట్టుని తొలగించిన క్రమంలో ఆ చెట్టుకు మూలాధారం అయిన వేళ్ళు తెగిపోయాయి అని తెలిపారట.అంతేకాదు ఈ తప్పిదం ఓ చారిత్రిక కట్టడం ధ్వంసం అనే కోణంలో కూడా పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది.దాంతో ఇల్లు కట్టుకుందామని అనుకున్న వాళ్లకి 42 జరిమానా పడటంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియక తిప్పలు పడుతున్నారట.