కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్ధ మిస్ అయినట్లు తెలుస్తుంది.మాజీ సీఎం అల్లుడు కన్నా కేఫ్ కాఫీ డే అధినేత గా సిద్దార్ధ సుపరిచితులు.1990ల్లో ఆయన కేఫ్ కాఫీ డే వ్యాపారాన్ని మొదలు పెట్టి అనతికాలంలోనే మంచి వ్యాపారవేత్తగా నిలిచారు.అంతేకాకుండా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 1550 బ్రాంచి ల ను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శ వ్యాపారవేత్తగా నిలిచారు.
అయితే ఆయన గత రాత్రి నుంచి కనిపించడం లేదని సమాచారం.అయితే, మరోపక్క ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం కూడా జరుగుతుంది.ఆయన నేత్రావతి నది వంతెన పై నుంచి కారులో వెళుతుండగా వాహనాన్ని ఆపమని డ్రైవర్ కు చెప్పి కారు నుంచి దిగి వెళ్లిపోయారని,ఆసమయంలో ఫోన్ లో ఆయన ఎవరితోనే సంభాషిస్తున్నట్లు డ్రైవర్ తెలిపినట్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.దీనితో ఆయన ఏమైనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానం తో అధికారులు,అగ్నిమాపక సిబ్బంది కలిసి గాలింపుచర్యలు చేపట్టారు.
సిద్దార్థ కనిపించడంలేదనే వార్త క్షణాల్లో కర్ణాటక అంతటా వ్యాపించింది.దీంతో ఎస్ఎం కృష్ణ ఇంటికి సిద్దార్థ బంధువులు,స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.కాగా, ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవికను వీజీ సిద్దార్థ వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.దేశంలోనే అతిపెద్ద కేఫ్ కాఫీ డే సంస్థతో పాటు హాటల్ బిజినెస్ కూడా చేస్తున్నారు.