నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ రూలర్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దారుణమైన టాక్ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు రివ్యూలు కూడా దారుణంగా రావడంతో కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు.
ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి కలెక్షన్ల పరంగా కూడా చాలా తక్కువ వసూళ్లు సాధించింది.అయితే ఈ సినిమా నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ను వదలనని అంటున్నారు.జైసింహా, రూలర్ వంటి సినిమాలతో నష్టాలను చవిచూసిన ఈ నిర్మాత ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తన నెక్ట్స్ మూవీ కూడా బాలయ్యతోనే ఉంటుందని సి.కళ్యాణ్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ సినిమాకు డైరెక్టర్ కూడా కెఎస్ రవికుమార్ అని ఆయన తేల్చేశాడు.అంటే బాలయ్య, కెఎస్ రవికుమార్, సి.కళ్యాణ్ ముగ్గురు కలిసి ముచ్చటగో మూడోసారి ప్రేక్షకులకు ముచ్చమటలు పట్టించేందుకు రెడీ అవుతున్నారు.కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబోలో సినిమా వద్దని వేడుకుంటున్నారు.
మరి ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.