ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అంబరాన్ని అంటుతుంది.ఒకపక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో ప్రజలలో ఉన్న భయం పూర్తిగా కనుమరుగైంది.
థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు జనాలు భారీస్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు.ఇదిలాఉంటే ఎప్పటిలాగానే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఎడ్ల పందెం ఇంకా అనేక రీతులుగా సంక్రాంతి వేడుకలు జరిపిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
గత ఏడాది వైయస్ జగన్ ముఖ్యఅతిథిగా ఈ వేడుకలకు హాజరు కావడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ ఏడాది వేడుకలలో కొడాలి నాని తో కలిసి పాల్గొన్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ టు వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యం లో జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమానికి శ్రీ కొడాలి నాని ఆహ్వానం మేరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరయ్యారు.కాగా మహమ్మారి వైరస్ భయం ఏ మాత్రం లేకుండా ఎడ్ల బండలాగుడు ప్రదర్శన చూడటానికి కృష్ణాజిల్లాలో మాత్రమేకాక పరిసర ప్రాంతాల్లో ఉన్నారు జనాలు కూడా భారీ స్థాయిలో రావడం విశేషం.