హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.అయితే ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు చాలా వరకు గెలుపు కొరకు ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది.అయితే చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు రచ్చ నడుస్తున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ గెలుపుపై ధీమాతో ఉండగా టీఆర్ఎస్ మాత్రం మెజారిటీపై లెక్క లేసుకుంటున్న పరిస్థితి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ప్రజల్లో ఈటెల పై ఉన్న సానుభూతి ఈటెలను గెలిపించేలా చేస్తుందా లేక టీఆర్ఎస్ దళిత బంధు లాంటి పధకం టీఆర్ఎస్ ను గెలిపించేలా చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏది ఏమైనా దుబ్బాక ఎన్నిక తరహాలోనే ఈ ఎన్నికలో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషించేలా కనిపిస్తోంది.ఎందుకంటే ఆ ఎన్నిక నుండి మొదలుకొని ఈ ఎన్నిక వరకు సోషల్ మీడియా ప్రభావం ఇంకా పెరిగిపోయిన పరిస్థితి ఉంది.అయితే ఇటు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా వార్ పై ఎక్కువగా దృష్టి పెట్టినటట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి కూడా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ ప్రచారాన్ని కూడా దుమ్ములేపుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయాన్ని కూడా చాలా వరకు ఆసక్తిగా గమనిస్తూ ఈ ఉప ఎన్నికలో గెలిచిన పార్టీకె ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందుకే చాలా వరకు పార్టీలు ఈ విజయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది.మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయనే దానిపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.