మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం రిలీజ్కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో చిరు పర్ఫార్మె్న్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిరు అండ్ టీమ్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా లైన్లో పెట్టే పనిలో పడ్డారు.ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజాతో మలయాళ చిత్రం ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు మెహర్ రమేష్తో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్ను తెరకెక్కించేందుకు చిరు రెడీ అవుతున్నారు.కాగా ఈ సినిమాలతో పాటు దర్శకుడు బాబీ చెప్పిన ఓ సబ్జెక్టును కూడా చిరు ఓకే చేశారట.
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
బాబీ చిరంజీవితో తెరకెక్కించబోయే చిత్రం పూర్తిగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవి పక్కా పల్లెటూరి వ్యక్తిగా ప్రేక్షకులకు కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.పూర్తి ఫ్యామిలీ డ్రామా చిత్రంగా ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్గా ప్రకటించి, వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రారంభించేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి బాబీ డైరెక్షన్లో చిరంజీవి ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.