కొన్ని సినిమాల శాటిలైట్ రైట్స్ను విడుదలైన తర్వాత అమ్మేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఎందుకంటే సక్సెస్ అయితే ఎంత చెప్పితే అంతకు తీసుకునేందుకు ఛానెల్స్ వారు ముందుకు వస్తారు.
కాని ఎక్కువ శాతం రిస్క్ తీసుకోవడం ఎందుకు అని శాటిలైట్ రైట్స్ను ముందే అమ్మేసేందుకు సిద్దం అవుతారు.విడుదలకు ముందు కూడా పెద్ద హీరోల సినిమాలను దక్కించుకునేందుకు పలు ఛానెల్స్ ముందుకు వస్తాయి.
కాని అవి కోట్ చేసే అమౌంట్ తక్కువగా ఉంటుంది.
విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయితే అన్ని ఛానెల్స్ కూడా పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి మరీ దక్కించుకునేందుకు ఎగబడతాయి.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రంను మాత్రం అప్పుడే సన్ నెట్వర్క్కు అమ్మేశారు.ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
హ్యాట్రిక్ కాంబో అయినప్పటికి ముందే శాటిలైట్ రైట్స్ను అమ్మడం చర్చనీయాంశం అవుతోంది.సినిమాపై ఏమైనా అనుమానం ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
శాటిలైట్ రైట్స్తో పాటు ప్రైమ్ వీడియో రైట్స్ను కూడా సన్ నెట్వర్క్ దక్కించుకుంది.ఈ రెండు రైట్స్కు గాను నిర్మాతలకు సన్ నెట్వర్క్ నుండి దాదాపుగా 14.5 కోట్లు ముట్టినట్లుగా తెలుస్తోంది.సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ రైట్స్ అమ్మితే 20 కోట్లకు మించి వచ్చేవి అనేది కొందరి మాట.మొత్తానికి శాటిలైట్ రైట్స్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్లు తొందరపడ్డ విషయమై టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.