ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.ఈ కాలంలో మంచి ఆహారం, మంచి నిద్ర తప్పనిసరిగా ఉండాలి.
అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.ఇంకా కరోనా సోకకూడదు అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంకా ఈ నేపథ్యంలోనే మజిగ్గ చారుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయిని నిపుణులు చెప్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
మజ్జిగ చారు ఆరోగ్యానికి ఎంతోమంచిదని వంటగదిలో అందుబాటులో ఉండే వాటితో తయారు చేసే ఈ మజ్జిగ చారులో ఉండే బ్యాక్టీరియా మనకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.సాధారణంగానే పెరుగు లేదా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే.
ఇంకా పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా రెట్టింపు శాతంలో ఉంటుంది.ఈ బ్యాక్టీరియా పేగుల్లోని చెడు బ్యాక్జీరియాను చంపేసి శరీరంలోకి ఎలాంటి వైరస్లు రాకుండా రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
అంతేకాదు మజ్జిగలోని ల్యాక్టిక్ ఆమ్లం కొవ్వు పెరగకుండా సాయం చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సాయం చేస్తుంది.రోగనిరోధక శక్తిని పుష్కలంగా పెంచి ఎలాంటి వైరస్ లు మానవద్దకు రాకుండా కాపాడుతుంది అని వైద్యులు చెప్తున్నారు.