స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
కాగా ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్కు త్రివిక్రమ్ టేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.
థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది.ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మా పాటలు ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లాయి.
ఇక ఈ సినిమాలోని బుట్ట బొమ్మా పాట సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ యూట్యూబ్లో దుమ్ములేపుతోంది.తాజాగా ఈ పాటకు యూట్యూబ్లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇలాంటి పాటలు చాలా అరదుగా వస్తాయని, అందుకే ప్రేక్షకులు ఈ పాటలకు బ్రహ్మరథం పడుతున్నారని పలువురు సినీ విశ్లేషకులు తెలిపారు.బన్నీ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకుంది.