14 అడుగుల లోతులో బస్సు బోల్తా.. !

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఓ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కిందికి పడిపోయింది.

 Vishakapatnam, Road Accident, Bus, Police-TeluguStop.com

బస్సు బోల్తా పడటం చూసిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.అనంతరం స్థానిక పోలీసుస్టేషన్ కు విషయం తెలియజేశారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఓ బస్సు అదుపు తప్పి 14 అడుగుల లోతులో పడిపోయిన ఘటన విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం పెనుగొండలో చోటు చేసుకుంది.చెన్నై నుంచి విశాఖ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై వస్తోంది.

పెనుగొండ వద్ద ఉన్న వంతెనపై అదుపుతప్పి 14 అడుగుల లోతులో పడిపోయింది.అదృష్టవశాత్తు బస్సులో ఐదుగురు ప్రయాణికులే ఉండటంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.

స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందజేశారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ కొనసాగించారు.

గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube