తిరుపతి నుండి ప్రయాణికులను తిరుమలకు తీసుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది.కనుమ దారిలో ద్విచక్ర వాహనంను దాటించే క్రమంలో ఆర్టీసి డ్రైవర్ బస్సును ఎక్కువ టర్న్ చేశాడని, దాంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు.బస్సు బోల్తా పడి ఒక చెట్టుకు తాకి ఆగిపోయిందని, లేదంటే భారీగా ప్రాణ నష్టం ఉండేదని అధికారులు అంటున్నారు.
పది మందికి స్వల్ప గాయాలు అవ్వగా వారిని తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స అందించినట్లుగా చెప్పుకొచ్చారు.ప్రమాదంకు సంబంధించిన విషయమై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
సంఘటన స్థలంకు అధికారులు మరియు టీడీపీ సభ్యులు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రమాదం విషయం తెలియడంతో పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
అయితే ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.