కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరు మృతి చెందినా ఆ మృతి వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా అన్న ఆలోచన ప్రతిఒక్కరిలో పెరిగిపోతుంది.వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మృతి చెందినప్పటికీ కూడా కరోనా వల్లే మృతి చెంది ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా ఆఫ్రికాఖండ దేశం బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా ఆకస్మిక గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తుంది.అయితే ఇటీవలే అనారోగ్యం బారిన పడ్డ ఆయన కోలుకోగా ఇప్పుడు ఉన్నట్టుండి చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆకస్మిక గుండెపోటుతోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం చెబుతున్నా కరోనాతోనే చనిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడం తో ఈ అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.55 ఏళ్ల కురుంజిజా శనివారం ఆస్పత్రిలో చేరి, సోమవారానికల్లా కోలుకున్నాడు.
మంగళవారం అనూహ్యంగా గుండెపోటు వచ్చిందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బతికించలేకపోయామని వైద్యులు చెబుతున్నారు.
కురుంజిజా భార్య డెనిస్కు ప్రస్తుతం కెన్యాలోని అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.బురుండీలో ఇప్పటివరకు 83 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మాత్రమే చనిపోయినట్లు తెలుస్తుంది.