మన దేశంలో క్రికెట్ ఆటకు అభిమానులు ఎక్కువ.మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.
క్రికెట్ను మాత్రం మన వాళ్లు గుండెలకు హత్తుకుంటారు.టెస్ట్ మ్యాచ్లు, 20-20లు, ఐపీఎల్లు, వరల్డ్ కప్లు ఇలా.ఏ మ్యాచ్ను వదలకుండా చూస్తూంటారు.ఆఫీసులో ఉన్నా.
ఇంట్లో ఉన్నా.ఫ్రెండ్స్తో ఉన్నా ఎప్పుడూ క్రికెట్ గురించే చర్చ.
ఇప్పుడు మనం క్రికెట్ గురించి ఇంతలా ఎందుకు చర్చించుకోవలసి వచ్చిందంటే దానికి ఓ కారణం ఉంది.మన టీం ఇండియా క్రికెట్ జర్సీకి అరుదైన గౌరవం దక్కింది.
దుబాయ్లో అతి పెద్ద కట్టడం అయిన బుర్జ్ కలీఫాపై భారత క్రికెట్ జట్టు ధరించే జర్సీ ప్రదర్శింపజేశారు అక్కడి అధికారులు.అలాగే క్రికెట్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లి, రాహుల్ జడేజాల ఫొటోలు కనిపించాయి.
దీంతో అందరూ ఆశ్చర్చపోయారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
కొత్త జర్సీ ఎంపీఎల్ స్పోర్ట్స్ అనే సంస్థ రూపొందించింది.ఈ జర్సీని చాలా ఆకర్షణీయంగా రూపొందించారు.
చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తోంది.ఇలా ఇండియన్ క్రికెట్ టీంకు సంబంధించిన ఫొటోలు బుర్జ్ కలీఫాపై కనిపించడం ఇది తొలిసారి కాదు.
ఇంతకు ముందు కూడా ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి.గత సంవత్సరం ఐపీఎల్ విన్నర్ టీం కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఫొటోను అక్కడ ప్రదర్శించారు.
అప్పుడు కూడా క్రికెట్ అభిమానుల్లో చాలా ఆనందం కనిపించింది.కానీ ఈ సారి ఏకంగా టీం ఇండియా జెర్సీ బుర్జ్ కలీఫాపై చూపించడం వల్ల క్రికెట్ అభిమానుల్లో అనందం రెట్టింపు అయ్యింది.ఈ కొత్త జర్సీని రూపొందించిన సంస్థ ఇండియన్ మెన్స్ టీంకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నది.ఇది ఇలా ఉండగా.ఈ జర్సీని అభిమానుల ఆలోచనలే ధ్యేయంగా రూపొందించామని ఆ సంస్థ చెప్పింది.ఇలా చేయడం ఇప్పుడే మొదటిసారని ప్రకటించింది.