కరోనా విపత్కర సమయంలో లాక్డౌన్ విధించడంతో సినిమా థియేటర్లతో పాటు ,చిత్ర నిర్మాణాలు కూడా ఆగిపోయాయి.కేసులు తగ్గుతున్న క్రమంలో లాక్ డౌన్ నిబంధనలను సడలించి నిర్మాణాలను జరుపుకుంటున్న నేపథ్యంలో థియేటర్లో విడుదల చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారా.
లేదన్న ఉద్దేశంతో,సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదల అవుతున్నాయి.కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు రకాల షోలు, వెబ్ సిరీస్లు కూడా ఓటీటీలో విడుదలవుతున్నాయి.
అంతర్జాతీయ ఓటీటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటికి దీటుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా తో ముందుకు వచ్చాడు.ప్రస్తుతం ఈ యాప్ ఎంతో ప్రజాదరణ పొందుతోంది.
ఇప్పటికే ఈయాప్ ద్వారా విడుదలైన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.ఈ యాప్ లో విడుదలైన కృష్ణ అండ్ హిస్ లీల, భానుమతి వంటి చిత్రాలు హిట్ అయ్యాయి.
ఇటీవల విడుదలైన “కలర్ ఫోటో“ఈ చిత్రానికి మిశ్రమ ఫలితాలను అందించింది.
అలా వైకుంఠపురం చిత్రనిర్మాణం జరుగుతున్నప్పుడు ఆహా టీం అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి ఏవైనా కొత్తగా ప్లాన్ చేయాలి అని అడగడంతో త్రివిక్రమ్ తో కలిసి
కొత్త యాడ్
చేయడానికి ఫిక్స్ అయ్యారు.అయితే ఈ యాడ్ లో నటుడు నవదీప్ ను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ఈ యాడ్ లో నటించినట్లు చెప్పారు.ఇంతకీ ఆ యాడ్ లో ఏముందంటే…
ఓ ఇంట్లో తన ప్రియురాలు ఒంటరిగా ఉండడంతో ఆ ఇంట్లోకి అల్లు అర్జున్ వెళ్తాడు.
.అయితే కొద్దిసేపటికే ఆ అమ్మాయి తండ్రి వచ్చి డోర్ కొట్టగా ఎంతసేపటికి డోర్ తీయకపోతే అనుమానం వచ్చి రూమ్ మొత్తం వెతుకుతాడు.
తరువాత తన అన్న వచ్చి మంచం కింద, కబోర్డ్ మొత్తం వెతుకగా అల్లుఅర్జున్ కనిపించడు.రాత్రంతా అలాగే ఉండిపోతాడు.
రాత్రంతా కబోర్డ్ లో ఏం చేస్తున్నావ్ అని అడిగితే “ఆహా “చూస్తున్నానని చెబుతాడు.నిజానికి ఈ యాడ్ నవదీప్ ను ఊహించుకున్న చేసినదనీ, నవదీప్ అయితే అచ్చం అలాగే చేసేవాడని నవదీప్ ను సరదాగా ఆట పట్టించారు.
ఈ విధంగా ఆహా పునాది ఏర్పడిందని ఓ సందర్భంలో అల్లు అర్జున్ తెలియజేశాడు.