తెలుగు సినిమా ప్రొడక్షన్ బ్యానర్ లలో గీతాఆర్ట్స్ 2 అంటేనే బన్నీవాసు.బన్నీ వాసు అంటేనే గీతాఆర్ట్స్ 2. ఇలా గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ లో బన్నీ వాసు జడ్జిమెంట్ పై ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇలా బన్నివాసు అంటే అతను జడ్జిమెంట్ చేసే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని నమ్మకం బయ్యర్లకు ఉండేది.
అయితే ఆ నమ్మకాన్ని బన్నీ వాసు చావు కబురు చల్లగా సినిమాతో కొంతవరకు తగ్గించాడు.
ఈ సినిమా బన్నీ వాసు జడ్జిమెంట్ పైనే తెరకెక్కింది.
ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో బన్నివాసు ఎంతో కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.అయితే ఈ సినిమా విడుదలయ్యే థియేటర్లలో ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇదిలా ఉండగా బన్నీవాసు జడ్జిమెంట్ పైనే అత్యంత భారీ బడ్జెట్ తో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కింది.ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సెకండ్ హాఫ్ సినిమా ఏ మాత్రం బాగా లేదని చెప్పడంతో బన్నివాసు టెన్షన్ మొదలైంది.
ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాను సెలెక్ట్ చేసుకోవడం తప్పని చెప్పారు.ఇక పోతే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాపై ఈ విధమైనటువంటి విమర్శలు రావడంతో బన్నీవాసులో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే నటించడంతో ఈ సినిమాపై ఎక్కడో కొద్దిగా బన్నీ వాసు హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.పూజా హెగ్డే కు యూత్ లో బాగా క్రేజ్ ఉండడం చేత ఆమెను ఎంతో అందంగా చూపిస్తే ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమాలోని పాటలు పోస్టర్లలో పూజా హెగ్డే చేత కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ చేయిస్తూ.
ఆమె అందం పైనే నమ్మకం పెట్టుకున్నారు బన్నీవాసు.మరి ఆ నమ్మకం గెలుస్తుందా లేక…ఈ సినిమా కూడా బన్నీ వాసును తీవ్ర నిరాశకు గురి చేస్తుందా.తెలియాలంటే అక్టోబర్ 8వ తేదీ వరకు వేచి చూడాలి.