ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఏవిధంగా దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుందో రోజూ చూస్తూనే ఉన్నాం.ఇక ఈ తరుణంలోనే సినిమా షూటింగ్స్ అన్నీ కూడా వాయిదా పడడంతో ప్రముఖ సినీ తారలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇక తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు గురువారం ఉదయం వెళ్లారు.మాములుగా ఎప్పుడు అక్కడికి వెళ్ళిన ఎదో ఒక హంగామా సందడి అనేది ఉండేది.
కాకపోతే నేడు మాత్రం అక్కడ కరోనా నేపథ్యంలో అలాంటి ఆర్భాటాలు ఏమీ లేకపోవడంతో చాలా నిరాశకు గురయ్యాడు అల్లు అర్జున్.ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
చాలా రోజుల తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళానని, అక్కడ ఎలాంటి సందడి లేదని చెప్పుకొచ్చారు.ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితిలో నుంచి అందరూ త్వరగా బయట పడాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ టీ షర్ట్ ధరించి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఆవరణలో దిగిన ఫోటోను తన అభిమానులతో ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
ఇక ఈ పోస్టులో బన్నీ ని చూసిన అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు.
ఇందులో భాగంగానే ఒక నెటిజన్ ఏంటి బ్రో… కనపడిన ప్రతిసారి ఏదోక కొత్త లుక్ తో దర్శనమిస్తున్నారు అని కామెంట్ చేశారు.ఇక మరికొందరు ‘ మీరన్నట్లుగా మేము కూడా అదే ఆశిస్తున్నాము, త్వరగా షూటింగ్స్ మొదలవ్వాలని.
నిన్ను మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని ‘ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం బన్నీ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.
ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా తీసేందుకు అల్లు అర్జున్ ఓకే చెప్పారు.