టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.నిన్న రాత్రి అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు రామలింగయ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో బన్నీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాకు 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నాన్నమ్మ, తాతయ్యలతోనే ఉన్నానని బన్నీ తెలిపారు.
తాతయ్య చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు 10 లక్షల రూపాయలు వచ్చాయని బన్నీ చెప్పుకొచ్చారు.
అయితే ఆ డబ్బులు నాకు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు.తాతయ్య ఎందుకిలా చేశారని ఆయన బీమా కట్టిన సంవత్సరాన్ని చూశానని బన్నీ తెలిపారు.
తాతయ్య డబ్బు జమ చేయడం మొదలుపెట్టిన సమయంలో నేను నాలుగో తరగతి చదువుతున్నానని బన్నీ అన్నారు.
నేను జీవితంలో ఎందుకూ పనికిరానని 18 సంవత్సరాల తర్వాత పది లక్షల రూపాయలు ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయని భావించి తాతయ్య ఆ డబ్బును నాకోసం జమ చేశారని బన్నీ చెప్పుకొచ్చారు.
ఆయన దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని అల్లు అర్జున్ వెల్లడించారు.ఈ స్థాయిలో నేను ఉండటం విషయంలో ఆనందంగా ఉందని బన్నీ కామెంట్లు చేశారు.
తాతయ్య కూడా నా ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేదని బన్నీ తెలిపారు.బన్నీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గంగోత్రి సినిమా నుంచి పుష్ప ది రైజ్ వరకు సినిమాసినిమాకు బన్నీ రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బన్నీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బన్నీ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని బోగట్టా.