స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురం లో ” సినిమా హిట్ కొట్టడం తో ప్రస్తుతం ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం భారీ గా హిట్ టాక్ ని కూడా అందుకుంది.
అయితే ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం విదితమే.ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ పక్కన రష్మిక మందానా కథానాయికగా కూడా ఎంచుకున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రం కు సంబంధించి తాజా సమాచారం ఒకటి వచ్చింది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని ఈ నేపథ్యంలో .స్మగ్లర్ లకి సహకరించే లారీ డ్రైవర్ పాత్ర తో పాటు కాస్త స్టైలిష్,మోడ్రన్ లుక్ లో మరో పాత్ర లో అల్లు అర్జున్ కనిపించనున్నాడని చెబుతున్నారు.అయితే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ రింగుల జుట్టుతో .గుబురు గెడ్డంతో టోటల్ గా సరికొత్త లుక్ లో అల్లు అర్జున్ కనిపించనున్నాడట.
అయితే ప్రత్యేకంగా ఈ లుక్ లో బన్నీ నేచురల్ గా ఉండటం కోసం సమయం తీసుకుంటున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.ఇప్పటికే సుకుమార్ ‘రంగస్థలం’వంటి మంచి హిట్ తో ఉండగా, రష్మిక కూడా వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
మరి ఈ ముగ్గురి కాంబినేషన్ లో మూవీ వస్తుంది అనగానే అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు మొదలుపెట్టేశారు.