స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఎప్పటికి మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
అయితే ఈ ఖాళీ సమయంలో తన నెక్స్ట్ సినిమాల కోసం కథలని పుష్కలంగా వింటున్నాడు.అందులో భాగంగా నాలుగు ప్రాజెక్ట్ లని బన్నీ లైన్ లో పెట్టాడు.
నా పేరు సూర్య సినిమా తర్వాత ఆల వైకుంఠపురంలో సినిమా ఒకే చేయడానికి బన్నీ ఏకంగా ఏడాదికి పైగానే సమయం తీసుకున్నాడు.అయితే నెక్స్ట్ సినిమాల విషయంలో ఇక ఆలస్యం చేయకూడదని ముందుగానే దర్శకులు చెప్పిన కథలు వింటూ వాటిని లాక్ చేస్తున్నాడు.
అయితే ఈ నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లలో దేనిని ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాని ఎనౌన్స్ చేసేసారు.
వకీల్ సాబ్ తర్వాత వేణు ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టబోతున్నాడు.ఇక కొరటాల శివ చెప్పిన కాలేజీ నేపధ్యంలో నడిచే కథకి కూడా బన్నీ ఒకే చెప్పాడు.
అలాగే యాత్ర ఫేమ్ మహి వి రాఘవ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.దీంతో పాటు రీసెంట్ గా సురేందర్ రెడ్డి చెప్పిన కథకి కూడా బన్నీ ఒకే చెప్పాడని చర్చ నడుస్తుంది.
అయితే వీటిలో ముందుగా ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే ప్రస్తుతం పరిస్థితిలో పుష్ప సినిమా ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చూసుకొని తన నెక్స్ట్ మీద బన్నీ ఫోకస్ పెడతాడని, ఈ కథలని కేవలం లాక్ చేసి ఉంచాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.