గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా గురించి జోరుగా టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.ఉగాది తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు బన్నీ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు.
అయిన కూడా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాని ఈ నెల 24న స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపించింది.
అయితే ఊహించని విధంగా శ్రీరామనవమి సందర్భంగా త్రివిక్రమ్, బన్నీ తమ సినిమాకి ప్రారంభంకి కొబ్బరికాయ కొట్టేసారు.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.అల్లు అర్జున్ తో పాటు దర్శకనిర్మాతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా మరో సారి మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది.గీతా ఆర్ట్స్ తో పాటు , హారికా హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.