ఆ ఆరోపణ చేసి ఇరుక్కుపోయిన బండి సంజయ్... అదేంటంటే?

తెలంగాణలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.

 Bundy Sanjay Who Is Stuck With That Allegation Is That S Bandi Sanjay, Bjp Party-TeluguStop.com

మొదటి దశ కరోనా వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదైనా మరణాలు తక్కువగా నమోదైనాయి.చికిత్స ద్వారా కరోనా నుండి రికవరీ అయిన వారు చాలా మంది ఉన్నారు.

కాని రెండో దశ కరోనా వైరస్ లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాక దేశం మొత్తం ఈ తరహా పరిస్థితులు ఉన్నాయి.

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణలో కరోనా ఇంతలా విజ్రుంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కరోనా మరణాలన్నీ తెలంగాణ ప్రభుత్వ హత్యలని బండి సంజయ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.అయితే ఇక్కడే బండి సంజయ్ అధికారపక్షానికి దొరికి పోయాడు.

కరోనా మరణాలు ఒక్క తెలంగాణలో జరిగితే బండి సంజయ్ ఆరోపణకు కొంత బలం చేకూరుతుంది.కానీ ఇప్పుడు కరోనా మరణాలు దేశమంతా జరుగుతున్నాయి.అయితే దేశమంతా జరిగే  కరోనా మరణాలను కూడా కేంద్రప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా బీజేపీ విమర్శలు టీఆర్ఎస్ కే మంచి అవకాశంగా మారేలా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube