తెలంగాణలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
మొదటి దశ కరోనా వేవ్ లో కేసులు ఎక్కువగా నమోదైనా మరణాలు తక్కువగా నమోదైనాయి.చికిత్స ద్వారా కరోనా నుండి రికవరీ అయిన వారు చాలా మంది ఉన్నారు.
కాని రెండో దశ కరోనా వైరస్ లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాక దేశం మొత్తం ఈ తరహా పరిస్థితులు ఉన్నాయి.
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణలో కరోనా ఇంతలా విజ్రుంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కరోనా మరణాలన్నీ తెలంగాణ ప్రభుత్వ హత్యలని బండి సంజయ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.అయితే ఇక్కడే బండి సంజయ్ అధికారపక్షానికి దొరికి పోయాడు.
కరోనా మరణాలు ఒక్క తెలంగాణలో జరిగితే బండి సంజయ్ ఆరోపణకు కొంత బలం చేకూరుతుంది.కానీ ఇప్పుడు కరోనా మరణాలు దేశమంతా జరుగుతున్నాయి.అయితే దేశమంతా జరిగే కరోనా మరణాలను కూడా కేంద్రప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా బీజేపీ విమర్శలు టీఆర్ఎస్ కే మంచి అవకాశంగా మారేలా కనిపిస్తోంది.