సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు.తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకునేందుకు విమాన ప్రయాణాలు దోహద పడతాయి.
అయితే విమానాల్లో జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలని చాలా మందికి ఉంటుంది.అయితే ఎక్కువ మొత్తంలో ఉండే విమాన టికెట్లను కొనుగోలు చేయలేక వెనుకంజ వేస్తుంటారు.
ఈ తరుణంలో విమాన ప్రయాణాలు చేసే వారికి AirAsia ఇండియా గుడ్ న్యూస్ అందించింది.తన సీజన్ సేల్లో భాగంగా ₹1,497కే టికెట్లు విక్రయిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే బస్సు టికెట్ ధర ఇంత కంటే ఎక్కువ ఉంటుంది.బస్సు టికెట్ కంటే తక్కువ ధరకే విమాన టికెట్ ఉండడంతో పలువురిలో ఆసక్తి ఏర్పడింది.
బెంగళూరు-కొచ్చి వంటి రూట్లతో పాటు భారత దేశంలో వివిద రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది.10 జనవరి 2023 నుంచి 13 ఏప్రిల్ 2023 మధ్య ప్రయాణం చేయొచ్చు.అయితే అందుకు ముందుగా అంతా 6 డిసెంబర్ 2022 వరకు బుకింగ్ చేసుకోవాలి.ఎయిర్లైన్ తన వెబ్సైట్ www.airasia.co.in, మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ఛానెల్లలో చేసిన బుకింగ్ల కోసం ఈ ఆఫర్ను పొడిగించింది.టాటా NeuPass సభ్యులు ఎయిర్లైన్ వెబ్సైట్, మొబైల్ యాప్, Tata Neu Superapp ద్వారా బుకింగ్పై ఎంచుకున్న రూట్లలో అదనంగా 20% బేస్ ఫేర్ను పొందవచ్చు.
NeuPass సభ్యులు కాంప్లిమెంటరీ ఫ్రూట్ ప్లాటర్ మరియు ప్రాధాన్య బ్యాగేజీ చెక్-ఇన్ మరియు బోర్డింగ్తో పాటు 8% వరకు Neu కాయిన్లను కూడా పొందుతారు.దీంతో ఆయా రూట్లలో రాకపోకలు సాగించే వారు తమ ప్రయాణ తేదీలకు అనుగుణంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.తక్కువ ధరకే తమకు నచ్చిన నగరానికి ప్రయాణాన్ని చేయొచ్చు.